అటెండరు ఆదాయం పది వేలు-పెద్ద రైతు ఆదాయం రెండున్నర వేలు!!

Monday, June 21, 2010

చిన్ని ఉద్యోగి ఆదాయం లో నాల్గో వంతుకుడా పది ఎకరాల రైతుకు అందడం లేదు.రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేసే అటెండరు కనీస ఆదాయం నెల కు పదివేల రూపాయిలు .సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఆదాయం వస్తుంది.అయితే దేశానికి తిండి గింజలు పండించే ఒక పెద్ద రైతుకు నెల కు రెండున్నర వేలు కూడా ఆదాయం లబించడం లెదుఇ.దేల్తాప్రంతం లో పది ఎకరాల రైతంటే పెద్ద రైతుగానే చెప్పుకుంటారు అయితే అయన ఆదాయం చూస్తే నెలకు రెండున్నర వేలుకూడా లేదని ఇటివల ఒక పరిశీలనలో వెల్లడైంది .
వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం ,ధరల నిర్ణాయక సంఘానికి (c.a.c.p) కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది డా.s.మహేంద్ర దేవ్ ను నియమించిన విషయం తెలిసిందే .అయన ఇటివల గుంటూరు,కృష్ణ,తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటించి రైతుల స్థితిగతులను ,పంటల ఉత్త్పత్తుల పై పరిశీలన జరిపారు .ఒక ఎకరా ధాన్యం ఉత్త్పత్తికి 14-16 వేలు కర్చవ్తున్నట్టు అయన పరిశీలనలో వెల్లడైంది ఆ మేరకు ప్రతి ఎకరలో ఎంత పంట ఉత్త్పత్తి అవ్తున్నది లెక్కగట్టారు.కనీసం ఒక పంట కు (ఆరు నెలలకు ) 14-16 వేలు కర్చుపెడితే ఎకరాకు సరాసరి 20 quintals ధన్యం ఉత్పత్తి అవ్తున్నది అని తేల్చారు కేంద్రప్రభుత్వం నిర్ణఇంచిన క్వింటాల్ ధాన్యం ధర ఈ ఏడాది 850 రూపాయిలు మాత్రమే అంటే 20 క్వింటాళ్ళ ధాన్యానికి రైతుకు వచ్చేది 17000 మాత్రమే కర్చులు 16 వేలరుపయిలు పోను ఆ రైతులకు మిగిలింది వెయ్యి ,రెండువేలు,దిగుబడి తగ్గి కర్చులు పెరిగినా రైతుకు వచ్చే ఆదాయం లో కోతబడక తప్పదని స్పష్టం అవుతోంది .గత ఏడాది మూడు సంవత్సరాలలో కూలిరెట్లు ,పురుగుమందులు,ఎరువులు,డిజిల్ రెట్లు లాంటి ఉత్పాదక కర్చులు వందశాతం పెరిగాయి .ఆ మేరకి ధాన్యం మద్దతు ధరలు పెరగలేదు.2005 లో అధిక వర్షాలు ,2006 లో ఓగ్ని తూఫాను 2007 ఫిబ్రవరి ,ఏప్రిల్ మధ్య ఒకలా వర్షాలు,2008 లో అధిక వర్షాల కారణం గా కోస్తప్రంతం లో లక్శలదీ ఎకరలో వారి,మినుమ,శనగపంతలు బాగా దెబ్బతిని రైతాంగం కోట్ల రూపాయిలు నష్టపోయారు .కృష్ణ,గోదావరి డెల్ట లలో నారుమల్లలు.ఊడ్చిన వరిచేలు ముంపునకు గురి అయ్యి అపరానస్టటం జరిగింది ఇలాంటి పరిస్థితి లో రైతుల తీవ్ర నిరశానిశ్రుహ లో ఉన్నారు 65 శాతం భూమిని కౌలుదారులు చేస్తున్నారు ఉత్పత్తి కర్చులకు కౌలురెట్లు కూడా కలుపుకుంటే అసలు వచ్చే ధరకు ,ఖర్చులకు పొంతన కుదరకపోగా పెట్టుపడులు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు .దాంతో సన్నకారు చిన్నకారు రైతులు ప్రకృతి వైపరిత్యాలు ఒక వైపు, చిదపీడలు మరోవైపు గిట్టుబతుధారాలు లేక రైతులు అప్పుల ఊభి లో కూరుకుపోతున్నారు.వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారునికి చేరప్పటికి వంద రూపాయిల వస్తువు మూడు వందల రూపాయిలు చేరిపోతోంది దీనిని నియంత్రించలేని చేతగాని ప్రభుత్వ ఎంత్రంగం రైతుల పై విరుచుపడి ఎగుమతులను నిలిపివేయడం,వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోనివ్వకుండా ఆంక్షలు విదించడం లాంటి చర్యలకు పాల్పడి రైతులను సర్వనాశనం చేసే పనికి పూనుకుంది.గత సంవత్సరం ధాన్యం ధర 760 రూపాయిలు కాగా మిల్లు దగ్గర బియ్యం 1185 రూపాయిలు మాత్రమే!!!!అదే బియ్యం మార్కెట్టు లో 1600 రూపాయిల నుండి 1900 రూపాయిలకు దళారీలు అమ్ముతుంటే నియంత్రించ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రత్యేకించి సన్న బియ్యం అయితే 2200-2600 రూపాయిలకు అమ్ముతున్నారు.రైతుకు అందిన ధరతో పోలిస్తే ఈ ధర రెట్టింపు అవ్తుంది కందులు కిలోకు 18 రూపాయిలకు అమ్మారు ..అమ్ముతున్నారు .కూరగాయలు కిలో రూపాయి నుండి మూడు రూప్యిలకు రైతుల నుంచి కొని ,రైతు బజారు లో ఆరు రూపాయిలకు,మార్కెట్టు లో పది రూపాయిలకు అమ్ముతుండగా .రీటైల్ లో 30 రూపాయిలకు అమ్ముతున్నారు .
పెప్సి కంపెనీ తయారు చేసే పెప్సి,లేచిప్స్ లేని పల్లెటూరు లేదు.అనేక మల్టీ నేషనల్ అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం కోట్లాది రుపయిలలు రాయితీలు పొంది కొట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు.ఆ కంపెనీ c.e.o వార్షిక ఆదాయం 32 కోట్లు కాని వారికీ కావాల్సిన ముడిపదార్థాలు చేసే చేసే చెరకు బంగాల్లడుమ్పల రైతులు ధరలు లేక ఆర్తనాదాలు చేస్తున్నారు

No comments:

Post a Comment

insanefreakz..reviews and fun

insanefreakz..reviews and fun
click on the ad to enter