ఎంతో ఎత్తుకు దేశం-అట్టడుగున రైతాంగం

Monday, June 21, 2010

1947-2005 మధ్యకాలం లో భారతదేశం ప్రపంచదేశాలలో ప్రభలమైన ఆర్దిక శక్తి గా ,అగ్రగామిగా అవతరించింది .అయితే రైతాంగం మాత్రం లక్షయభైవేల పైగా ఆత్మహత్యలకు పల్పదవాల్సిన దుర్గతి ఏర్పడింది. దేశం ఎంతో ఎత్తుకు ఎదిగినప్ప్తికి ,దేశానికి అన్నం పెట్టె రైతులు ఆర్దికం గ అట్టడుగున చేరిపోయారు .మన శాస్త్రవేత్తలు రాకెట్లు ,ఉపగ్రహాలను దేశీయ పరిజ్ఞానం తో అబివృద్ది చేసి అతరిక్షం లోకి పంపిస్తున్నారు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లు రోడ్ల పై పరుగులు తీసుతున్నై మన రైతులు మాత్రం వ్య్వసయపనిముట్లు కోల్పోయారు,ఎద్దులను,ఎద్దుల బండ్లను అన్ని అమ్ముకుని వ్యవసాయం నీర్సిన్చిపాయింది
అత్యంత ప్రతిస్తాత్మకమైన సాంకేతిక విశ్వవిద్యాలయాలు .మేనేజిమెంట్ విశ్వవిధ్యలలలు మన దేశం లో ఉన్నాయ్.అంతేగాక ప్రపంచ స్థాయి ఐదు నక్షత్రాల హోటల్స్ దేశీయం గ అభివృద్ధి చెందాయి అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాలు అంతర్జాతీయ సౌకర్యాలు కల్గిన విమానాశ్రయాలు అత్యాధునిక ఆసుపత్రులు ప్రపంచ ప్రక్యత వైద్యనిపుణులు అల అన్ని రంగాలలో అభివృద్ధి అయింది .
మన దేశ రైతులు మాత్రం య్వసయంలో నస్టాలపాలై తమ ఉనికినే కోల్పోయే విధం గా,అత్మగౌరావాలను తాకట్లు పెట్టేవిధం గా నగరాలలో రిక్షాలు తొక్కుతూ ,ఆటో నడుపుతూ, అడుక్కుతింటు,అడ్డకూలిలా పనిచేస్తున్నారు.డాక్టర్స్,ఇంజనీర్లు లాంటి వృతి నిపుణులు అమెరికా వంటి అగ్రరాజ్యాలకు వలసలు పోయి డాలర్ల పంట పదిస్తుండగా ,రైతాంగం ఊర్లు పొలాలు వదిలి తిండి కోసం కొటిపట్లు పడుతున్నారు.పిల్లల చదువులకు,పెళ్ళిలకు బలవంతం గ భూములను తకట్టుపెట్టడం ,అమ్మడం చేస్తున్నారు వ్యవసాయం నష్టాల పాలై అప్పుల ఊభి లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .

No comments:

Post a Comment

insanefreakz..reviews and fun

insanefreakz..reviews and fun
click on the ad to enter