
పెట్రోల్ ప్రయాణానికి ఉపయోగపడితే ...కొబ్బరి మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం !1970 ప్రాంతం లో ఒక కొబ్బరి కయ అమ్మితే ఒక లీటర్ పెట్రోలు కొన్నుకునే పరిస్థితి ఉండేది !ఇప్పుడు పది కొబ్బరి కాయలు అమ్మిన లీటర్ పెట్రోలు రావడం లేదు.అంటే పెట్రోలు విలువ ఎన్నో రెట్లు పెరిగిన కొబ్బరికాయ విలువ మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోవడం లేదు ....అంతే కాదు శీతల పానియాల విషయం లోను అదే వర్తిస్తుంది ..అనేక రసాయనాలతో తయరుయ్యే శీతలపానియలు మొదట్లో 50 పైసలు నుంచి రూపాయి చొప్పున కొబ్బరికాయ రెండు రూపాయిల ధర ఉండేది ఇప్పుడు కొబ్బరి ధర 5 రూపాయిలు కాగా ,శీతల పానియాల ధర 10 నుంచి 15 చొప్పున ఉన్నాయ్ ...శీతలపానియలకన్న మజ్జిగ శ్రేస్తామైనా ,కొబ్బరి నీరు ఎంతో ఉపయోగామైనా వీటి ధరలు అలాగే ఉన్నాయ్.పారిశ్రామిక ఉత్పతులకు పాలకులు ఇస్తున్న విలువ వ్యవసాయ ఉత్పతులకు ఇవ్వకపోవడమే ఈ వ్యత్యాసానికి కారణం గా చెప్పవోచ్చు ....అంతే గాక పారిశ్రామిక ఉత్పతులలో ఉండే సంఘీభావం ప్రలోభాల స్వభావం, వ్యవసాయ ఉత్పతులలో లేకపోవడమే కారణం గ చెప్పొచ్చు !





No comments:
Post a Comment