
21వ శతాబ్దం లో అంటారని వారు మన దేశం లో అన్నధతలే అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దికేక్కరు .భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అన్ని రంగాలు ప్రబుత్వ ఉద్యోగులు ,రాజకీయ వర్గాలు మేధావులు,పత్రికలూ,మీడియా యావత్తు రైతుల ఆశలను సజీవం గ నిలపడం లో విఫలమైయ్యాయి .కనుచూపు మేర లో రైతులకు ఆశరేఖలు కనిపించడం లేదు.కరువులు,వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తోడు వరుస పంట నష్టాలు ,పంటల భీమ అక్కరకురాకపోవడం ,బ్యాంకుల పరపతి సౌకర్యం పనిక్రనిది కావడం,అధిక వడ్డీలు,పెట్టుబడులలో విపరీతమైన ఖర్చు,కల్తి ఎరువులు ,నకిలీ విత్తనాలు ,ప్రబుత్వరైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను అష్టాదిగ్బంధం చేసి ఆత్మహత్యలే శరణ్యం అనేటట్టు శాపిస్తున్నాయి .
ఆత్మహత్యలు :
1995 లో :10719,
1996 లో :13730,
1997 లో :13616,
1998 లో :6010,
1999 లో :16079,
2005 నాటికీ 25017 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు .ఇలా గత 10 ఏళ్ళ లో మూడు లక్షల 35 వేల రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.అయిన పాలకులలో చలనమే లేదు .నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు .
1980 ప్రాంతం లో 150 ఉన్న జీతం 2008 నాటికీ 25 వేల రూపాయిలకు పెరిగి ప్రబుత్వోద్యోగులు తమ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకొగలుగుతున్నారు .అదే సందర్భంధం లో వ్యవసాయ కుటుంబాలు దేశానికి అన్నం పెట్టగలిగే స్థితి నుండి తాము తిండి కోసం వలసలు ,ఆత్మహత్యలకు పాల్పడవలసి వస్తున్నది.
2002 ఏప్రిల్ లో ఎఫ్ .సి .ఐ వద్ద నిల్వున్న బియ్యం ,గోధుమల నిల్వలు 630 లక్షల టన్నులు .ఆ బస్తాలను ఒకదాని పక్కన ఒకటి పెర్చుకుపోతే భూమి నుండి చంద్రమండలానికి తిరిగి భూమికి ఉన్నదూరానికి సరిపోతుందని ప్రణాళిక సంఘ సభ్యులు అమర్త్య సేన్ వ్యాఖ్యానించారు .
2003 లో ఏర్పడిన దుర్బిక్ష పరిశితుల వాళ్ళ ఆ సంవత్సరం 310 లక్షల టన్నుల పంట దిగుబడి తగ్గింది దాంతో ఆహారధాన్యాల నిల్వలు తగ్గిపోయి,దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .2003 సంవత్సరంలోలాగే దుర్బిక్ష పరిస్థితి ఏర్పడితే దేశం లో ఆహార సంక్షోబం తప్పదు .
వ్యవస్త యోగ్యభూమి 1980-1981 లో 185 మిలియన్ హెక్టార్ల నుండి 2005-06 వచ్చేసరికి 182.5 మిలియన్ హెచ్తరాలకు తగ్గింది .వ్యవసాయేతర భూమి 19.66 మిలియన్ హెక్టార్ల నుండి 29.94 మిలియన్ హెచ్తర్లకు పెరిగింది అయిన పెరిగిన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూనే ఉన్నాము.
రైతు జీవితం గానుగ ఎద్దులా మారుతోంది.ఎదుగూ బోదుగు లేని జీవితం గడుపుతూ నిరాశ నిశ్రుహ కు లోనుఅవుతూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు.దీనివల్ల దేశానికే ఆహారబధ్రత కరువవుతోంది .అంతర్జాతీయ విపణి లో టన్ను బియ్యం 1000 దలర్లుంది .అందుచేత ధన్యం మద్దతు ధర రూ.1800 క్వింటాల్ చొప్పున ఇవ్వాలని భారతరైతుల సమాక్య కేంద్రప్రబుత్వాన్ని 2008 జూన్ నెల లో కోరడం జరిగింది.పెట్టించుకోవడానికి వారికీ తీరిక దొరకాలి గా?





No comments:
Post a Comment